
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 279వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత శనివారం ఉదయం విజయనగరంలోని నెల్లిమర్ల మండలం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని ముల స్టేషన్ మీదుగా ఎస్ఎస్ఆర్ పేట, సొలుపు క్రాస్, మన్యాపురి పేట, బెల్లం పేట, వల్లాపురం క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.