‘సన్యాసులకు భారతరత్న ఇవ్వాలి’ | Yoga Guru Ramdev Demands Bharat Ratna For Sanyasis | Sakshi
Sakshi News home page

Jan 27 2019 11:18 AM | Updated on Jan 28 2019 11:16 AM

Yoga Guru Ramdev Demands Bharat Ratna For Sanyasis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న’ ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.(ప్రణబ్‌దా భారతరత్న )

గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు కనీసం ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం దరదృష్టకరం. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నా’ అని రాందేవ్‌ పేర్కొన్నారు.  ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement