'వారి కదలికలపై కుల మీడియా నిఘా పెట్టింది'

Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలుగా పరిణమించాయని విమర్శించారు. శాసనమండలి రద్దుపై సీఎం జగన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టిందని తెలిపారు. వారి ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్‌ అయ్యారు.  (పూల ఖర్చు వృథా అయినట్టేనా బాబూ..!)

కాగా మరో ట్వీట్‌లో.. 'రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించాడు. ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగాడు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నాడు. చిట్టి నాయుడు, వెన్నుపోటు సహచరుడు నిరుద్యోగులవుతారని ఆయనకు భయం పట్టుకుంది' అని ట్వీట్ చేశారు.

'అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

'పప్పు నాయుడి రాజకీయ జీవితం ముగిసినట్టే'

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top