కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్‌ | VHP approaches President Kovind for ordinance | Sakshi
Sakshi News home page

కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్‌

Oct 6 2018 4:07 AM | Updated on Apr 6 2019 9:31 PM

VHP approaches President Kovind for ordinance - Sakshi

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్‌ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్‌ జన్మభూమి న్యాస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్‌ సన్సద్‌ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు.
ఢిల్లీలో సమావేశంలో
పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు

Advertisement
 
Advertisement
Advertisement