ప్రొద్దుటూరు టీడీపీలో తారాస్థాయికి విభేదాలు

TDP Leader Varadarajulu Reddy Fires On CM Ramesh  - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎంపీ సీఎం రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. తాను జీవించి ఉన్నంత వరకూ సీఎం రమేశ్‌ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని తెగేసి చెప్పారు. సీఎం రమేశ్‌ కనుసన్నల్లోనే ప్రొద్దుటూరులో కౌన్సిలర్లు రాజీనామాలు చేశారని ఆరోపించారు.

ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం రమేశ్‌ హస్తం ఉందని మీడియా సమావేశంలో వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు, తమ పదవులకు రాజీనామా చేస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డికి సోమవారం లేఖ ఇచ్చిన సంగతి తెల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top