రగులుతున్న అసమ్మతి.. టీడీపీ మేయర్‌పై తిరుగుబాటు!

tdp corporators revolt on vijayawada mayor - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ కార్పొరేషన్‌ అధికారపక్షంలో అసమ్మతి సెగ రగులుతోంది. విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌పై టీడీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. మేయర్‌ వెంటనే మార్చాలంటూ పార్టీ నేతలకు లేఖాస్త్రాన్ని సంధించారు.

మేయర్‌పై ఎదురుతిరిగిన అసమ్మతి కార్పొరేటర్లకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్‌ అండగా నిలిచారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌ అండతో మేయర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ముందే పంచాయితీ పెట్టాలని అసంతృప్త కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ విజయవాడ అర్బన్‌ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నతో కార్పొరేటర్లు భేటీ అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top