ఎన్నికల అక్రమాలపై నిఘా

Surveillance on election irregularities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో జరిగే అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచటంతోపాటు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్నికల నిఘా కమిటీ ఏర్పాటైంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓటరు జాబితాలో అవకతవకలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. అవసరమైతే ఎన్నికల కమిషన్, పోలీసు, ఇతర అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులతో ఉమ్మడి వేదికలు నిర్వహించడం, ఓటింగ్‌ శాతం పెంచడానికి ఓటర్లను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 20 స్వచ్ఛంద సంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top