వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు.. వైజాగ్‌ చేరుకున్న ఎన్‌ఐఏ బృందం

NIA Team Came To Vizag To Investigate Murder Attempt On YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు ఎన్‌ఐఏ డీఐజీ ప్రవీణ్‌ బృందం సోమవారం వైజాగ్‌ చేరుకున్నారు. స్థానిక పోలీసులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అనంతరం ఎన్‌ఐఏ బృందం ఎయిర్‌ పోర్టులోని సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను పరిశీలించనున్నరు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసులో నిందుతుడు శ్రీనివాస్‌ రావును విచారణ చేయనున్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top