బీజేపీకి ఝలక్‌.. కాంగ్రెస్‌లోకి మరో నేత

Nandeshwar Goud Goodbye To BJP Join In Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌​ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శనివారం బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌, జానారెడ్డి, షబ్బీర్‌ అలీతో భేటీ అయ్యారు. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్‌ పా​ర్టీలో అధికారికంగా చేరనున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం టికెట్‌పై స్పష్టత ఇవ్వడంతో ఆయన చేరిక​ దాదాపు ఖరారైంది. బీజేపీ సీనియర్‌ నేత డీకే సమరసింహ రెడ్డి కూడా బీజేపీ గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కమళం పార్టీకి భారీ షాక్‌ తగిలింది.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top