నిజామాబాద్‌ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే | Municipal Elections TRS Won All Municipalities In Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే

Jan 25 2020 7:33 PM | Updated on Jan 25 2020 8:19 PM

Municipal Elections TRS Won All Municipalities In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబర్చింది. బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement