కేసీఆర్‌... ఎనిమిది సార్లు 

Many legislators have created records Telangana elections - Sakshi

రికార్డులు నమోదు చేసుకున్న పలువురు ఎమ్మెల్యేలు 

సాక్షి, హైదరాబాద్‌ : ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొందరు కొత్త రికార్డులు నమోదు చేశారు. పలువురు ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం కేసీఆర్‌ వరుసగా ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలిచి అందరి కంటే సీనియర్‌గా ఉన్నారు. సాధారణ, ఉప ఎన్నికలు కలిపి పలువురు పలుసార్లు విజయం సాధించారు.  

ఆరుమార్లు గెలిచిన వారు: ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్‌.రెడ్యానాయక్, ముంతాజ్‌ఖాన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ముంతాజ్‌ఖాన్‌. 
ఐదుసార్లు : ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అక్బరుద్దీన్‌ ఓవైసీ, గంప గోవర్ధన్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జి.సాయన్న, 
నాలుగుసార్లు : ఎన్‌.దివాకర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చెన్నమనేని రమేశ్, సోలిపేట రామలింగారెడ్డి, పాషాఖాద్రి, వనమా వెంకటేశ్వర్‌రావు, బాజిరెడ్డి గోవర్దన్, కె.తారకరామారావు, తాటికొండ రాజయ్య, జోగు రామన్న, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్‌. 
మూడుసార్లు: హన్మంత్‌ షిండే, గంగుల కమలాకర్, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, మహ్మద్‌ బలాల, మౌజంఖాన్, టి.పద్మారావు, సి.లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top