గడీల పాలన కూల్చి.. రామ రాజ్యం స్థాపిద్దాం : లక్ష్మణ్‌

Laxman Fires On CM KCR In Jana Chaitanya Yatra - Sakshi

9వ రోజు చేరిన బీజేపీ జన చైతన్య యాత్ర

జుక్కల్‌ సభలో కేసీఆర్‌పై లక్ష్మణ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌లో కలపాలని చూసిన నిజాం నవాబును సీఎం కేసీఆర్‌ పొగుడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ చేపట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచుకుంద్ద మార్కెట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ నిజాంను పొగుడుతుంటే ఆయన కూతురు కవిత అసలు తెలంగాణ భారత భూభాగమే కాదని అంటున్నారని తెలిపారు. భారత దేశంలో ఉంటు జైహింద్‌ అనని ఒవైసీతో కేటీఆర్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

దేశ ద్రోహుల పాలన కావాలా.. దేశ భక్తిగల బీజేపీ పాలన కావాలా మీరే నిర్ణయించుకోండని ప్రజలకు సూచించారు. ‘పేదవాడైన ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చూసి ఓర్వలేక కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నారు. ఈ గడీల రాజ్యాన్ని కూల్చీ గరిబోళ్ల రాజ్యం వచ్చేలా అందరూ సహకరించాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెపితే.. దానిని అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రామరాజ్యం స్థాపిస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే కౌలు రైతు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. కేవలం భూస్వాములకు లబ్ధి చేకుర్చాలనే రైతు బంధు పథకం తెచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top