మార్పునకు సంకేతం | Sakshi
Sakshi News home page

మార్పునకు సంకేతం

Published Mon, Oct 16 2017 7:20 PM

Jaipal Reddy.jpg - Sakshi

హైదరాబాద్‌: ప్రజాదరణతో కాంగ్రెస్‌ పునర్‌వైభవం సంపాదించుకుంటుండగా, అధికార బీజేపీ పతనం దిశగా పయనిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌ జైపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవలి గుర్‌దాస్‌పూర్‌, వెంగరలో జరిగిన ఉప ఎన్నికలు, నాందేడ్‌-వాఘాలా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గుర్‌దాస్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తమ పార్టీ ఘన విజయం దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతమన్నారు. ఈ ఎన్నికలో పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సునీల్‌ జాఖర్‌ దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా కేరళలోని వెంగరలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ బలపరిచిన ఐయూఎంఎల్‌ అభ్యర్థి గెలుపుసాధించారన్నారు. ఈ విజయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని చెప్పారు. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం అధికార ఎన్డీఏ పక్షానికి శరాఘాతం వంటిదని పేర్కొన్నారు. ఇదే ఒరవడి హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement