రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి..

kotamReddy Sridhar Reddy Slams to TDP Ministers - Sakshi

సాక్షి, నెల్లూరు: రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు నారాయణ, లోకేష్‌ కనుసన్నల్లో రూ. 400కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ కుంభకోణంలో రూ. 100కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు.

అంతేకాక ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని.. 5వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. దీంట్లో 5 నుంచి 10 శాతం కమీషన్‌ మంత్రులు తీసుకుంటున్నారని కోటం రెడ్డి తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top