అదే జరిగితే ఉరి వేసుకుంటా: కేఈ | Sakshi
Sakshi News home page

అదే జరిగితే ఉరి వేసుకుంటా: కేఈ

Published Wed, Jun 6 2018 12:56 PM

KE Krishnamurti Comments On TDP, Congress Alliance - Sakshi

సాక్షి, కర్నూల్‌: కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా.. జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు.

ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. ధైర్యం ఉంటే నాతో, నా కుటుంబంతో పోటీ చేసి గెలవాలి. నాపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానాలి. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల రాజీనామా ఓ నాటకం. వైఎస్సార్‌సీపీ, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌  వల్లే రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదం కాలేదు’  అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement