
ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్సభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు..
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్సభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు కారుపై రాళ్లతో దాడి చేశారు. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి జనసేన కార్యకర్తలను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. జనసేన కార్యకర్తల దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.



