రాజ్యసభ ఎన్నికలు : చెల్లని ఓట్లు టీడీపీవే

Interesting Thing In AP Rajya Sabha Elections - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 173 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ సందర్భంగా ఓ ఎమ్మెల్యే బ్యాలెట్‌ పేపర్‌పై రాసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును ప్రశ్నించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ‘గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకు ఇచ్చేది?’ అని బ్యాలెట్‌ పేపర్‌పై రాశారు. అయితే అలా రాసిన ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

మరోవైపు పోలైన 173 ఓట్లలో నాలుగు చెల్లనివిగా లెక్కింపు అధికారులు గుర్తించారు. ఆ నాలుగు ఓట్లు టీడీపీ ఎమ్మెల్యేలకు చెందినవని తెలిసింది. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. రిమాండ్‌లో ఉండటం ఎమ్మెల్యే అచ్చెన్నాయడు, కరోనా స్వీయ నిర్భంధంలో ఉండటం అనగాని సత్యప్రసాద్‌లు ఓటు వేయలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top