ఇసుక మాఫియా : టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం | High Court Fires On TDP MLA Yarapathineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

Jul 25 2018 7:15 PM | Updated on Aug 31 2018 8:42 PM

High Court Fires On TDP MLA Yarapathineni Srinivasa Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్‌ ఆరోపణల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు  మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది.  ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్‌ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్‌ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్‌, కేంద్ర మైనింగ్‌ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement