119 స్థానాల్లో పోటీ

Compete in 119 seats - Sakshi

బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వెల్లడి

కరీంనగర్‌: బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీ నర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కరీంనగర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై బీఎల్‌ఎఫ్‌ నుంచి ప్రజాగాయకుడు గద్దర్‌ను బరిలో దింపు తామన్నారు.

శాసనసభను రద్దు చేస్తూ.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలు బీసీలకు అప్పగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌తో జట్టు కడతామనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో చర్చలు ఉంటాయని, వారం రోజుల్లో స్పష్టత రానుందని ఆయన వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top