విచారణకు జగన్‌ సహకరించడంలేదని కోర్టుకు చెప్పండి  | Chandrababu command to the superior officers | Sakshi
Sakshi News home page

విచారణకు జగన్‌ సహకరించడంలేదని కోర్టుకు చెప్పండి 

Oct 29 2018 3:34 AM | Updated on Oct 29 2018 3:34 AM

Chandrababu command to the superior officers - Sakshi

సాక్షి, అమరావతి: హత్యాయత్నం కేసులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు సహకరించడంలేదని కోర్టుకు చెప్పాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం  ఇంటిలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో జగన్‌పై హత్యాయత్నం కేసు, ఆ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు.

సిట్‌కు వైఎస్‌ జగన్‌ వాంగ్మూలం నిరాకరించిన నేపథ్యంలో ఏపీ పోలీసులకు ప్రతిపక్ష నేత సహకరించడంలేదని చెప్పాలని అవసరమైతే దీనిపై కోర్టులో పిటిషన్‌ వేయాలని చంద్రబాబు వారికి సూచించారు. వైఎస్సార్‌ సీపీ ఈ కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతుండటంతో దానిపైనా చర్చించి సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు తాజా పరిణామాలపై చర్చించేందుకు మంత్రులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాలని భావించినా.. చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement