శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ మనస్విని సమర్పణలో శ్రీ ప్రవీణ్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'కాళిచరణ్'. చైతన్య , చాందిని నటీనటులు. నందన్ రాజ్ సంగీతం అందించారు. 1980లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాటలు ఇటీవలె విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు.