ఘనంగా "టాక్ - చేనేత బతుకమ్మ - దసరా" సంబరాలు

TAUK Chenetha Bathukamma Dasara Celebrations In London - Sakshi

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్   కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో  లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి  1200 మందికిపైగా  ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత హై కమిషన్ ప్రతినిధి రాహుల్‌, స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకిలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర  మంత్రి కేటీఆర్‌ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా  వేడుకలను "చేనేత బతుకమ్మ మరియు దసరా "గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.


 
తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం ఎంతో  సంతోషాన్ని..స్ఫూర్తినిచ్చిందని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల అన్నారు. కల్చరల్ ఇంఛార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్బంగా  స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ "  కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి  చూపించారని పలువురు ప్రశంశించారు.


 
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరాపండగ సందర్బంగా  మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య  కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతిథులందరి ప్రశంసలందుకోవడం  జరిగింది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా వినూత్నంగా ఇలా ఎదో ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని, పోయిన సంవత్సరం చార్మినార్‌ని ఏర్పాటు చేశామని కార్యదర్శి మల్లా రెడ్డి తెలిపారు.
 
విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్  జోగినపల్లి చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రజలంతా పాల్గొనాలని, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రశంసించడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్‌ని ఆవిష్కరించారు.  హాజరైన ముఖ్య అతిధులు మరియు  ప్రవాసులంతా " ఐ ప్లెడ్జ్‌ టు సపోర్ట్‌.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’’ అనే సెల్ఫీ స్టాండ్ వద్ద ఫోటోలు దిగి తమ మద్దతును తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్‌తో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి మాట్లాడుతూ.. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు  అభిప్రాయపడ్డారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గత  సంవత్సరాలుగా  చేనేతకు చేయూతగా మా వేడుకలని చేనేత బతుకమ్మ సంబరాలుగా చేయడం ద్వారా ఎన్నో నేతన్న కుటుంబాలకు మేలు జరిగిందని తెలిపారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి కృతఙ్ఞతలు తెలిపారు. వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేతపై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేతవస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీ కవిత గారితో  కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారుఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగల్గుతున్నామని, కాబట్టి కెసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.

టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ.. నేటి వేడుకల్లో స్థానిక బ్రిటిష్ వారు సైతం పాల్గొనడమే కాకుండా, మమ్మల్ని అడిగి తెలుసుకొని బతుకమ్మను తయారు చేసి తెచ్చి, బతుకమ్మ ఆటలో పాల్గొనడం మాకెంతో స్ఫూర్తినిచ్చింది తెలిపారు. టాక్ కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన మీడియా సంస్థలకు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి  ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని  ప్రశంసించారు.

 ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా  ఉన్నపట్టికి,  బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో  ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు. ఈ  కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టి. ఆర్.ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం,  టాక్ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్  ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, టాక్ జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు ముఖ్య సభ్యులు మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల,నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి,వంశీ రెక్నర్ , రంజిత్ చాతరాజు,సత్యం కంది,గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్,రవి రేటినేని ,రవి ప్రదీప్ పులుసు,,సత్య చిలుముల,శ్రీధర్ రావు,వెంకీ సుదిరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్,వంశీ పొన్నం, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్ , నవీన్ మాదిరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి,సురేష్ బుడగం,మధుసూదన్ రెడ్డి,వంశీ పొన్నం  మహిళా విభాగం సభ్యులు శ్వేతా రెడ్డి,సుష్మన,జహ్నవి వేముల, సుప్రజ పులుసు,క్రాంతి రేటినేని,మమత జక్కీ ,శ్వేతా మహేందర్, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top