విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం | Study on setting up airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం

Jan 4 2018 2:33 AM | Updated on Aug 9 2018 4:51 PM

Study on setting up airport - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపిం చాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజును టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కోరారు. ఆమె బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.

అనంతరం కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభును కలసి బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న స్పైసెస్‌ పార్కుకు సంబంధించిన వివరాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్కుకు 40 ఎకరాలు కేటాయించి రూ.30 కోట్లు విడుదల చేసిందని వివరించారు. కేంద్రం తరఫున రూ.20 కోట్లు విడుదల చేసేందుకు సురేశ్‌ ప్రభు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement