ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని భారత్లో నిర్మిస్తున్నారు.
ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని భారత్లో నిర్మిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లోని కౌరీలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ రైల్వే వంతెన 359 మీటర్లు ఎత్తు ఉండవచ్చని భావిస్తున్నారు. 2016 నాటికి ఇది పూర్తి కానుంది.
భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జమ్మూ, కాశ్మీర్ లోయలను కలుపుతూ సాగే రైల్వే ప్రాజెక్టులో భాగంగా చెనాబ్ నదిపై వంతెనను కడుతున్నారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది.