రక్షించండీ.. అని రైల్వే మంత్రికి ట్వీట్ | women passinger tweeted to suresh prabhu | Sakshi
Sakshi News home page

రక్షించండీ.. అని రైల్వే మంత్రికి ట్వీట్

Nov 28 2015 1:30 PM | Updated on Aug 25 2018 6:31 PM

రక్షించండీ.. అని రైల్వే మంత్రికి ట్వీట్ - Sakshi

రక్షించండీ.. అని రైల్వే మంత్రికి ట్వీట్

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తనకు అపాయం ఉంది రక్షించండీ.. అని ఏకంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసింది.

ముంబై: రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తనకు అపాయం ఉంది రక్షించండీ.. అని ఏకంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబై అవుట్ స్టేషన్ షిగావ్ సమీపంలో రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ ఓ వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో తనను రక్షించాలని కోరుతూ ట్విట్టర్లో రైల్వే మినిస్టర్కు సందేశాన్ని పంపింది. ఈ ట్వీట్ను గమనించిన అధికారులు వెంటనే మహిళకు సహాయం అందించడానికి రంగంలోకి దిగారు. రైలు తదుపరి స్టేషన్కు చేరుకునే సరికి రైల్వే పోలీసులు సదరు మహిళ ముందు ప్రత్యక్షమయ్యారు.

పోలీసులు వెళ్లి ట్వీట్ చేసిన మహిళను విచారించగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్తో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉండటంతో భయపడి ట్వీట్ చేసినట్లు తెలిపింది. పోలీసులు అతన్ని పక్క భోగీలోకి తీసుకెళ్లారు. అయితే ప్రయాణికులు ఎమర్జెన్సీ సహాయం అవసరమైతే 182 నెంబర్కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement