'పది కూడా పాసవ్వని వారు మాకొద్దు' | Voters want young, educated candidates in Maharashtra: Survey | Sakshi
Sakshi News home page

'పది కూడా పాసవ్వని వారు మాకొద్దు'

Oct 25 2016 4:26 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహారాష్ట్ర ప్రజానీకం తమకు నాయకులుగా విద్యావంతులను, యువకులను కోరుకుంటున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రజానీకం తమకు నాయకులుగా విద్యావంతులను, యువకులను కోరుకుంటున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో 40 ఏళ్లలోపు విద్యావంతులైన యువకులే తమకు నాయకులుగా రావాలని 84శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారని ఆ సర్వే పేర్కొంది. గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్-పుణె సంస్థ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించింది.

92శాతం మంది ఓటర్లు డిగ్రీ పట్టాలున్నవారే తమకు నాయకులుగా రావాలని కోరుకుంటున్నారని కూడా ఆ సర్వే తెలిపింది. స్థానిక ఎన్నికల్లో కనీసం మెట్రిక్యూలేషన్ ఉత్తీర్ణత సాధించినవారు కూడా ఉండటం లేదని 78శాతం మంది ఓటర్లు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేవారు అవినీతిపరులే ఉంటారని 80శాతంమంది ఓటర్లు నమ్ముతుండగా ధనవంతులై ఉండి ఎన్నికల్లో పోటీ చేసేవారు ఆ ఎన్నికలను కొంటారని 85శాతంమంది ఓటర్లు నమ్ముతున్నారు. నవంబర్ 27, 2016 నుంచి జనవరి 8, 2017 వరకు మొత్తం 33 జిల్లాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement