'మోదీ వద్ద అల్లావుద్దీన్ దీపం లేదు' | Venkaiah about Pm Modi | Sakshi
Sakshi News home page

'మోదీ వద్ద అల్లావుద్దీన్ దీపం లేదు'

Feb 23 2016 7:09 AM | Updated on Mar 29 2019 9:31 PM

'మోదీ వద్ద అల్లావుద్దీన్ దీపం లేదు' - Sakshi

'మోదీ వద్ద అల్లావుద్దీన్ దీపం లేదు'

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికయిన 20 నగరాలూ.. జూన్ 25వ తేదీ కల్లా ప్రాజెక్టు పనిని ప్రారంభించాలని కేంద్ర మంత్రి వెంకయ్య కోరారు.

జూన్ 25 కల్లా ‘స్మార్ట్ సిటీ’ పని మొదలవ్వాలి: వెంకయ్య
 
 న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికయిన 20 నగరాలూ.. జూన్ 25వ తేదీ కల్లా ప్రాజెక్టు పనిని ప్రారంభించాలని కేంద్ర మంత్రి వెంకయ్య కోరారు. ఆ రోజు కల్లా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టి ఏడాది పూర్తవుతున్న విషయం తెలిసిందే. ‘ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ : తదుపరి చర్యలు’ అనే అంశంపై  ఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక కాలేదన్న విషయాన్ని ఉదహరిస్తూ.. ఈ ఎంపికలో ఎటువంటి రాజకీయాలూ లేవన్నారు.

‘‘ప్రతి నగరాన్నీ స్మార్ట్ సిటీగా మార్చటానికి ప్రధాని దగ్గర అల్లావుద్దీన్ దీపం లేదు. ’’ అని అన్నారు. ప్రజలు పాలనాయంత్రాంగానికి సహకరించకపోతే ఒక నగరం స్మార్ట్ సిటీగా ఎలా అవుతుందంటూ.. ఈ ప్రాజెక్టు విజయవంతం కావటానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించటానికి వీలులేదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన 20 నగరాలు, ఫాస్ట్ ట్రాక్ పోటీలో పాల్గొంటున్న 23 నగరాలు గల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement