-
‘మత’ రిజర్వేషన్లకు మద్దతివ్వం
బీసీ ప్రతినిధుల సభలో కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. దానికి మేము మద్దతివ్వం. ఆర్థికంగా వెనుకబ డిన వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేం దుకు మాత్రమే రిజర్వేషన్లను ఉపయోగించుకో వాలి. ప్రభుత్వాలు ఆ మేరకు చర్యలు తీసుకో వాలి’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్లో జరిగిన బీసీ ప్రతిని ధుల మహాసభలో ఆయన మాట్లాడారు. ‘పేద కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహ కరిస్తుంది. మతపరమైన రిజర్వేషన్లతో ఇతర కులాలు నష్టపోతాయి. కాంగ్రెస్ బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసింది. ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల మాదిరిగా సర్వాధికారాలను సొంతం చేసుకుం ది. అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు రాజ్యాధికారం లేకుండా పోయింది. కానీ, బీజేపీ హయాంలో బీసీ నేత ప్రధానిగా ఉన్నారు’ అని వెంకయ్య చెప్పారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగా ల్లో సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. అవి రాష్ట్ర ప్రభుత్వ కమిషన్లు... రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బీసీ కమిషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే విషయాలనే నివేదిక రూపంలో ఇస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా నివేదికలు ఇచ్చి వాటిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ‘రాష్ట్ర బీసీ కమిషన్ ఆగమేఘాల మీద ఒక్క ముస్లింల రిజర్వేషన్లపైనే ప్రభుత్వానికి నివేదిక ఎలా ఇస్తుంది. బీసీల్లో ఉన్న అన్ని కులాలపై అధ్యయనంచేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. ఆమేరకు చర్చించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ఈ రిజర్వేషన్ల ను పార్లమెంటు ఆమోదిస్తేనే అమలు సాధ్యమ వుతుంది.’ అన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీల్లో కొత్త కులాలు పుట్టుకొస్తున్నాయని, ఇటీవల భూపా లపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో రాజన్న కులం పేరు విన్నానన్నారు. సమగ్ర అధ్యయనం చేసి బీసీల స్థితిగతులను పరిశీలిం చాలని సూచించారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా లభించడంతో బీసీలపై జరిగే అక్రమాలు, అన్యాయాలను పరిశీలించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించి నందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయలను సన్మానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీసీ సంఘ నేతలు సత్యనారాయణ, గొరిగె మల్లేశ్ యాదవ్, కృష్ణ పాల్గొన్నారు. -
తెలంగాణకు రూ.1,673 కోట్లు
అటల్ మిషన్ కింద కేటాయించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: అటల్ మిషన్ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.1,673 కోట్లు కేటాయించింది. 2015–17 మధ్యకాలానికి రూ.970 కోట్లు, వచ్చే మూడేళ్లలో రూ.703 కోట్ల మేర నిధుల వ్యయానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,673 కోట్ల నిధుల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తన వాటాగా రూ.832 కోట్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రి వెంకయ్య ఆమోదం తెలిపారు. తెలంగాణలో అమృత్ పథకం కింద ఎంపికైన 12 పట్టణాలకు నిధుల విడుదలపై శుక్రవారం ఢిల్లీలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ 12 పట్టణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రణాళికలను సమీక్షించిన కేంద్రం.. 2015–16కు రూ.415 కోట్లు, 2016–17కు రూ.555 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అలాగే 2017–20 మధ్యకాలానికి రూ.703 కోట్లు కేటాయించడానికి అంగీకరించింది. రానున్న మూడేళ్లకు ఆమోదించిన నిధుల్లో నీటి సరఫరా కోసం రూ. 559 కోట్లు, మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి రూ.126 కోట్లు.. పార్కులు, పచ్చదనం పెంపునకు రూ.17 కోట్లను కేటాయించనున్నారు. తాగునీటి సరఫరాకు కేటాయించిన రూ.559 కోట్ల నిధుల్లో వరంగల్కు మాత్రమే రూ.424 కోట్లు కేటాయించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకుగాను ఖమ్మంకు రూ.47 కోట్లు, మహబూబ్నగర్కు రూ.41 కోట్లు, కరీంనగర్కు రూ.24 కోట్లు, నల్లగొండకు రూ.11 కోట్లు, మిర్యాలగూడకు రూ.4 కోట్లు, సూర్యాపేటకు రూ.1.45 కోట్లు కేటాయించనున్నారు. అమృత్ మిషన్లో భాగంగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందివ్వాలని, ఒక్కో మనిషికి రోజుకు రూ. 135 లీటర్ల నీరివ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. -
16న యూపీ–బీజేపీ శాసనసభాపక్షం భేటీ!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం మార్చి 16న జరిగే వీలుంది. రాష్ట్రానికి సీఎంని నియమించే పనిలో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. రాష్ట్రానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి వెంకయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్లు నియమితులయ్యారు. 16న జరిగే సమావేశంలో వెంకయ్య, యాదవ్లు పాల్గొని, ఎమ్మెల్యేలను సంప్రదించి, సీఎం అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు నివేదిస్తారు. హోం మంత్రి రాజ్నాథ్ , రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తదితరుల పేర్లు సీఏం పదవికి పరిశీలనలో ఉన్నాయి. మళ్లీ సీఎంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వెనక్కు రావడానికి రాజ్నాథ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఒక పాత్రికేయుడు రాజ్నాథ్ను వివరణ కోరగా ఆయన ‘రామ్ రామ్’అంటూ వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన 403 మంది పేర్లతో కూడిన జాబితాను యూపీ ముఖ్య ఎన్నికల అధికారి, ఆ రాష్ట్ర గవర్నర్కు సమర్పించారు. -
భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి
⇒ ట్రంప్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి వెంకయ్య ⇒ కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబానికి పరామర్శ ⇒ అలోక్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ హైదరాబాద్/దుండిగల్: అమెరికాలో ఉన్న భారతీయుల రక్షణకు ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమెరికాలో జాతి వివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలసి ఆయన పరామర్శించారు. మృతుని కుటుంబానికి కావల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య చెప్పారు. శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొ చ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి దాడులను వ్యతిరేకించకపోతే అమెరికానే తీవ్రంగా నష్ట పోతుందని స్పష్టం చేశారు. అగ్రరాజ్యంతో భారత్ మిత్ర దేశంగా ఉందని.. ఆ మైత్రి అలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఘటనపై ఇప్పటికే విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసిందని, ఈ విషయమై త్వరలో ఓ బృందం ట్రంప్ను కలుస్తుందని వెంకయ్య తెలిపారు. అమెరికాలో భారతీయులను ఆదుకొంటాం: దత్తాత్రేయ అమెరికాలోని భారతీయులెవరూ భయపడా ల్సిన అవసరం లేదని దత్తాత్రేయ చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడిగానే భావి స్తున్నానన్నారు. అయితే ఈ దాడిని కేంద్రం సీరియస్గా తీసుకుంటుందన్నారు. అక్కడ ఉన్న తెలుగువారు ధైర్యంగా ఉండాలని సూచించారు. కాగా, ఇదే దాడిలో గాయపడ్డ అలోక్రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఆదివారం పరామర్శిం చారు. ఆర్కేపురంలోని అలోక్రెడ్డి నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, అలోక్రెడ్డి పరిస్థితి తెలుసుకునేందుకు అమెరికా వెళుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. -
మామను వెన్నుపోటు పొడవటం కన్నా ఘోరం
హోదా వద్దన్న బాబుపై పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని సీఎం చంద్రబాబు చెప్పడం అయన తన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడం కంటే ఘోరమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. హోదాను పక్కన పెట్టి ఏ స్వార్ధం తో చట్టబద్ధత లేని ప్యాకేజీ వెనుక పడు తున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలో లేనివి ఏవైనా ప్రత్యేక ప్యాకేజీలో చెప్పారా? అని నిలదీశారు. హోదా వస్తే రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు నష్టం జరుగుతుం దని మీరు చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే కాటేస్తారా? అని మండిపడ్డారు. మంగళ వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాబు, వెంకయ్య అధికారంలోకి రాగానే మత్తు ఆవహించి ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వెంకయ్యను ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హోదా వల్ల ఉపయోగం లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకయ్య, సుజనా చౌదరిలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పా లన్నారు. ఏ గణాంకాల ఆధారంగా హోదా వల్ల ఏపీకి రూ.3,500 కోట్లే అదనంగా వస్తాయని తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా వల్ల ఉపయోగాలేంటో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంద న్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చ డం సరికాదన్నారు. వివిధ సందర్భాల్లో వెంకయ్య హోదాపై మాట్లాడిన వీడియో క్లిప్పింగులు ఈ సందర్భంగా ప్రదర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement