రాష్ట్రపతితో ప్రధాని సమావేశం | Uri terror attack: PM Modi meets President to brief him on developments | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో ప్రధాని సమావేశం

Sep 19 2016 8:14 PM | Updated on Aug 25 2018 3:57 PM

రాష్ట్రపతితో ప్రధాని సమావేశం - Sakshi

రాష్ట్రపతితో ప్రధాని సమావేశం

యూరి లోని ఆర్మీబేస్ క్యాంపు కార్యాలయంపై ఉగ్రదాడి అనంతర పరిణామాలపై ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం రాష్ట్ర్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్  యూరి లోని ఆర్మీబేస్ క్యాంపు కార్యాలయంపై  ఉగ్రదాడి అనంతర పరిణామాలపై  ప్రధాని నరేంద్రమోదీ సోమవారం  సాయంత్రం  రాష్ట్ర్రపతి భవన్ లో  ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఉగ్రదాడి, అనంతర పరిణమాలపై  మోదీ రాష్ట్ర్రపతికి  వివరించారని  అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతకు ముందు ప్రధాని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, హోం, రక్షణ శాఖ  సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిపై చర్చించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement