అగ్నికి ఆహుతైన అగ్నిమాపక సిబ్బంది | two fire men die in cylinder blast | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతైన అగ్నిమాపక సిబ్బంది

Feb 24 2017 4:33 PM | Updated on Sep 13 2018 5:22 PM

అగ్నికి ఆహుతైన అగ్నిమాపక సిబ్బంది - Sakshi

అగ్నికి ఆహుతైన అగ్నిమాపక సిబ్బంది

మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అవే మంటలకు ఆహుతి అయ్యారు.

ఢిల్లీ:
మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అవే మంటలకు ఆహుతి అయ్యారు. ఈ ఘోర ప్రమాదం పశ్చిమ ఢిల్లీలోని ఫుడ్‌ స్నాక్స్‌ షాపులో సంభవించింది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో షాపులో మంటలు చెలరేగాయి. మం‍టలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది షాపు షెట్టర్‌ ఎత్తడంతో అందులో​ఉన్న గ్యాస్‌ సిలీండర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడికక్కడే హరి సింగ్‌ మీనన్‌ (55) హారిఓమ్‌ (56)లు మృతి చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
 
ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ క్షతగాత్రులను పరామర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవడం, గ్యాస్‌ లీకేజి గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రజలు ఫైర్‌ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు అగ్ని ప్రమాదలు జరగకుండా అవగాహన కల్పించడం ఎంతో అవసరమని జైన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement