న్యూఢిల్లీ: అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణ విమాన ప్రయాణికులతో పాటు వీఐపీలను సైతం క్షుణ్నంగా తనిఖీ చేస్తుంటారు. వీఐపీలకు దుస్తులు విప్పించి తనిఖీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై వీఐపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం, వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్లోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు గతంలో కంటే తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు విప్పించి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించే ముందు పలు దశల్లో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు వారిని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందున్న కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు భారీ భద్రత చర్యలు తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల్లో రెండు పేలుళ్లు సంభవించగా, పేలని బెల్టు బాంబును భద్రత బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్లో ప్రయాణికుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు.
బ్రస్సెల్స్ దాడి భయంతో బూట్లు, బెల్టులు విప్పించి..
Published Fri, Mar 25 2016 3:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement