జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. | Three Terrorists Killed In Anantnag Encounter | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jun 29 2020 7:06 AM | Updated on Jun 29 2020 7:19 AM

Three Terrorists Killed In Anantnag Encounter - Sakshi

జమ్మూకశ్మీర్: అనంత్‌నాగ్‌ జిల్లాలోని కుల్చోహర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో సోమవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనిక బలగాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. శనివారం ఉల్లార్ గ్రామంలో సైనికులు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే. (పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; ముగ్గురు ఉగ్రవాదులు హతం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement