రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి | Three dead, one injured after being hit by a train in Howrah. | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి

Apr 14 2017 8:35 AM | Updated on Sep 5 2017 8:46 AM

రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి

రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి

సెల్ఫీ మోజు మరో ముగ్గురి ప్రాణాలను బలిగొంది.

కోల్‌కతా: సెల్ఫీ మోజు మరో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.

హౌరాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారిని రైలు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ముగ్గురు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement