ప్రేయసిపై కోపంతోనే చర్చిని ధ్వంసం చేశాడు | Spurned lover attacked Agra church: cops | Sakshi
Sakshi News home page

ప్రేయసిపై కోపంతోనే చర్చిని ధ్వంసం చేశాడు

Apr 24 2015 11:50 AM | Updated on Sep 3 2017 12:49 AM

నిందితుల దాడిలో ధ్వంసమైన సెంయింట్ మేరీస్ చర్చి (ఫైల్ ఫొటో)

నిందితుల దాడిలో ధ్వంసమైన సెంయింట్ మేరీస్ చర్చి (ఫైల్ ఫొటో)

ఆమెపై, తమను విడదీసిన కారణంపై కోపం పెంచుకున్న ఆ విఫల ప్రేమికుడు చర్చిని ధ్వసం చేసి పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి నేరం అంగీకరించాడు!

ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం. నాలుగు నెలల కిందట ఓ చర్చిలో ఆమెను చూసి మనసు పారేసుకున్నడు. మొదట ఆమె కూడా ఓకే చెప్పింది. వేర్వేరు మతాలు కాబట్టి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని, ఒక్కసారిగా ప్రేమబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది! ఆమెపై, తమను విడదీసిన కారణంపై కోపం పెంచుకున్న ఆ విఫల ప్రేమికుడు చర్చిని ధ్వసం చేసి పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి నేరం అంగీకరించాడు!

ఏప్రిల్ 16న నగరంలోని ప్రతాప్ పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి, ప్రతిమలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఊహించని విధంగా ప్రేమ కోణం బయటపడింది. ముగ్గురు నిందితుల్లో ఒకరైన హైదర్ అలీ ప్రేమ విఫలమైన నిర్వేదంలోనే స్నేహితుల సహాయంతో చర్చిని ధ్వసం చేశాడని, పోలీసుల ఇంటరాగేషన్లో నేరం అంగీకరించాడని ఓ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు.

 

సదరు చర్చికి వెళ్లే ఓ యువతి,  హైదర్లు ప్రేమించుకున్నారని, మతాలు వేరవ్వడంతో ఆమె పెళ్లికి నిరాకరించి, చెర్చికి రావడం మానేసిందని, దీంతో ఆమెపై, తమను విడదీసిన కారణంపై అక్కసు పెంచుకున్న హైదర్ దురాగతానికి ఒడిగట్టాడని, ఆ మేరకు వాగ్మూలం కూడా రాసిచ్చినట్లు సమాచారం. అయితే ఆగ్రా సిటీ ఎస్పీ సమీర్ సౌరభ్.. హైదర్ ను అదుపులోకి తీసుకున్న విషయం తప్ప మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement