కాలుతున్న శవాల మధ్య వేశ్యల నృత్యం | Sex Workers Dance Amid Funeral At Varanasi Know Why | Sakshi
Sakshi News home page

కాలుతున్న శవాల మధ్య వేశ్యల నృత్యం

Mar 29 2018 12:40 PM | Updated on Jul 23 2018 9:15 PM

Sex Workers Dance Amid Funeral At Varanasi Know Why - Sakshi

చైత్ర నవరాత్రి సప్తమి రోజున మణికర్ణిక ఘాట్‌ వద్ద వేశ్యల నృత్యం

వారణాసి : తమ వారిని కోల్పోయిన సమయంలో దహన సంస్కారాల వద్ద ఆ‍త్మీయుల రోదనలను చూస్తుంటాం. కానీ, వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ వద్ద ఇందుకు భిన్నంగా జరుగుతుంది. నిరంతరం దహన సంస్కారాలు జరిగే ఈ ప్రదేశంలో ఓ వింత ఆచారం అమలు అవుతోంది. చైత్ర నవరాత్రి సప్తమి రోజున రాత్రి నుంచి తెల్లవారే వరకూ వేశ్యలు అవిరామంగా మణికర్ణిక ఘాట్‌లో నృత్యాలు చేస్తారు.

అయితే ఈ నృత్యాలు వేడుక కోసం కాదు. జీవితంలో తాము చేసిన తప్పులను మన్నించమని మహా శంషాన్‌ బాబాను కోరుతూ వారందరూ ఈ నృత్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల మిగిలిన జీవితంలో ఆ వేశ్యలకు ఆనందం, గౌరవం దక్కుతాయని నమ్మకం. ఈ మణికర్ణిక ఘాట్‌ వద్దే పార్వతి దూరమైన తర్వాత ఆ ఎడబాటును భరించలేని మహాశివుడు తాండవ నృత్యం చేశాడని ప్రతీతి.

మణికర్ణిక ఘాట్‌ వద్ద వేశ్యలు చేసే ఈ నృత్యాన్ని ‘తపస్యా’ అని పిలుస్తారు. ప్రతి ఏడాది చైత్ర నవరాత్రి సందర్భంగా సప్తమి రోజున వేశ్యలు ఇక్కడికి వచ్చి బాబా ముందు నృత్యం చేస్తారు.

ఎప్పుడు మొదలైందీ సాంప్రదాయం...?
16వ శతాబ్దంలో అక్బర్‌ నవరత్నాల్లో ఒక్కరైన రాజా మన్‌ సింగ్‌ ఈ ఘాట్‌లో ఓ ఆలయాన్ని మహాశివుడికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ కాలుతున్న శవాల మధ్యకు వచ్చి నృత్యం చేసేందుకు ఏ కళాకారుడు ముందుకు రాలేదు. దాంతో వేశ్యలకు కబురు పంపడంతో వారు అక్కడకు వచ్చి నాట్యం చేశారు.

ఆనాటి నుంచి చైత్ర నవరాత్రి సప్తమి రోజున వేశ్యలు మణికర్ణిక ఘాట్‌లో నృత్యం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement