దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రయివేట్ బ్యాంక్ సెక్యూరిటీ వ్యాన్ నుంచి రూ.1.50 కోట్లు నగదు ...
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రయివేట్ బ్యాంక్ సెక్యూరిటీ వ్యాన్ నుంచి రూ.1.50 కోట్లు నగదు అపహరించుకు వెళ్లారు. చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును హతమార్చిన దుండగులు నగదుతో పరారయ్యారు. నార్త్ ఢిల్లీలోని కమలా నగర్ ఏరియాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.