భార్య వసంత డిమాండ్
ఆయన ఆమరణ దీక్షకు సన్నద్ధమతున్నారని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య వసంత డిమాండ్ చేశారు. ఢి ల్లీ యూనివర్సిటీ అధ్యాపక బృందం నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 90 శాతం వికలాంగుడైన తన భర్తను కనీస సదుపాయాలు లేని నాగ్పూర్ జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందునుంచీ తమ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు.
‘నాగ్పూర్ జైలులో ఉన్న నా భర్తను ఆయన సోదరుడు రాందేవుడు కలిశారు. వెలుతురు లేని చిన్నసైజు సెల్లో ఆయనను ఉంచారు. మిగిలిన ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా పెట్టారు. వీల్ చైర్లోఉండే ఆయన అక్కడి సంప్రదాయ మరుగుదొడ్లను ఉపయోగించడం చాలా కష్టం. ఆయన హార్ట్పేషెంట్, హైబీపీ ఉంది. వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలోనూ కూర్చోలేరు. కనీసం మందులు కూడా ఇవ్వట్లేదు. పోలీసులు ఇలాగే తనను ఇబ్బందిపెడితే గురువారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన రాందేవుడికి చెప్పారు’ అని వసంత అన్నారు. ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్ల అవకతవకలపై నిలదీసినందుకు వర్సిటీ పరిపాలన విభాగం సైతం తమపై కక్ష కట్టిందన్నారు.
సాయిబాబాను విచారించనున్న రాష్ట్ర ఎస్ఐబీ
మహారాష్ట్ర పోలీసుల అదుపులోఉన్న రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ సహాయ కార్యదర్శి సాయిబాబాను విచారించడానికి రాష్ట్ర యాంటీ నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించడమా, లేక మహారాష్ట్ర వెళ్లి విచారించాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఆయనపై రాష్ట్రంలో కేసులు లేనందున అక్కడికే వెళ్లి విచారించడమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం.
సాయిబాబాను విడుదల చేయాలి:వసంత
Published Thu, May 15 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement