విద్యార్థులపై ఎలుకల దాడి | rats attack on students in tiruchanur | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ఎలుకల దాడి

Sep 6 2015 10:58 PM | Updated on Sep 3 2017 8:52 AM

చిత్తూరు జిల్లా తిరుచానూరుకు సమీపంలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో శనివారం రాత్రి విద్యార్థులపై ఎలుకలు దండెత్తాయి.

తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరుకు సమీపంలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో శనివారం రాత్రి విద్యార్థులపై ఎలుకలు దండెత్తాయి. సుమారు పది మందిని కొరకడంతో వారికి గాయాలయ్యాయి. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.

అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం, సిబ్బంది గట్టి ప్రయత్నమే చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం రాత్రి మీడియా దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement