గోపాల్‌కృష్ణ గాంధీకి ‘సద్భావన అవార్డు’

Rajiv Sadbhavana Award for Gopalkrishna Gandhi - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ సమగ్రత, మతసామరస్యం, శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్‌ వోరా తెలిపారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద జ్ఞాపికతో పాటు రూ.10 లక్షల నగదు ఇవ్వనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top