కాక్‌పిట్‌ తలుపులు పగలగొడతా | Passengers threaten to open cockpit door on AI flight | Sakshi
Sakshi News home page

కాక్‌పిట్‌ తలుపులు పగలగొడతా

Jan 5 2020 2:43 AM | Updated on Jan 5 2020 2:43 AM

Passengers threaten to open cockpit door on AI flight - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా సిబ్బందిని ప్రయాణికులు దూషించడంతోపాటు వారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ–ముంబై వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఏఐ865 అనే విమానం పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు పైలట్‌లను బయటకు రావాలని లేకపోతే కాక్‌పిట్‌ తలుపులు పగులగొట్టి లోపలికొస్తానని బెదిరించాడని సమాచారం. అలాగే ఒక మహిళా ప్రయాణికురాలు సిబ్బందిలోని ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రధాన ద్వారం తెరవాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వర్గాలు తెలిపాయి.  ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఇండియా యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement