పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీకి ఎదురుదెబ్బ | Panchayat poll results jolt for Samajwadi Party heavyweights | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీకి ఎదురుదెబ్బ

Nov 2 2015 1:10 PM | Updated on Sep 17 2018 6:12 PM

ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.

ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 35,000 ప్రాంతీయ పంచాయతీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రముఖులు ఓటమి చెందారు. అత్యధిక స్థానాల్లో మంత్రులకు సంబంధించిన అభ్యర్ధులు ఓటమి చెందారు.


ఫలితాలపై భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బహదూర్ పాఠక్ మాట్లాడుతూ.. 'ఎన్నికల ఫలితాలు ప్రజల్లో సమాజ్ వాదీ పార్టీకి గల వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు' అని తెలిపారు

 

Advertisement
 
Advertisement
Advertisement