చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోయిస్టులు పంజా విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు.
చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోయిస్టులు పంజా విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తార్ డివిజన్లో పోలింగ్ బూతులకు సమీపంలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను అమర్చినట్టు పోలీసులకు సమాచారం అందింది.
చత్తీస్గఢ్ దక్షిణాది జిల్లాలు నారాయణపూర్, కొండగాన్లో మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి. అలాగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, పోలీసులపై మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఉన్న నేపత్యంలో భారీ భద్రత కల్పించనున్నారు. పోలింగ్ సెంటర్లను కలిపే మార్గాల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నారు. వర్షాకాలంలో మందుపాతర్లు అమర్చడం తేలిక. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.