breaking news
Improvised Explosive Devices
-
10 మంది తాలిబన్ తీవ్రవాదులు హతం
ఆఫ్ఘానిస్థాన్లోని హెల్మండ్ ప్రావెన్స్లో భద్రత దళాలు తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులోభాగంగా 10 మంది తీవ్రవాదులు హతమైయ్యారు. మరో 20 మంది తీవ్రవాదులు గాయపడ్డారని భద్రత దళ ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అనంతరం భద్రత దళాలు స్థానికంగా చేపట్టిన తనిఖీలలో 71 శక్తిమంతమైన పేలుడు పదార్థాలతోపాటు మోటర్ సైకల్ బాంబును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్లోని సంగిన్ జిల్లాలోని ఫత్తే మహ్మద్ పించ్ పరిసర ప్రాంతాలలో తీవ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పోలీసులతో కలసి తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హెల్మండ్ ప్రావెన్స్ తాలిబన్లకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని భద్రత దళ ఉన్నతాధికారి తెలిపారు. అయితే తీవ్రవాదులపై భద్రత దళాల దాడిపై తాలిబన్లు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. -
చత్తీస్గఢ్ ఎన్నికల్లో పేలుళ్లకు మావోయిస్టుల వ్యూహం
చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోయిస్టులు పంజా విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తార్ డివిజన్లో పోలింగ్ బూతులకు సమీపంలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను అమర్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. చత్తీస్గఢ్ దక్షిణాది జిల్లాలు నారాయణపూర్, కొండగాన్లో మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి. అలాగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, పోలీసులపై మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఉన్న నేపత్యంలో భారీ భద్రత కల్పించనున్నారు. పోలింగ్ సెంటర్లను కలిపే మార్గాల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నారు. వర్షాకాలంలో మందుపాతర్లు అమర్చడం తేలిక. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.