ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి | Naxal killed in crossfire | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

Oct 8 2016 2:00 PM | Updated on Sep 4 2017 4:40 PM

మహారాష్ట్ర బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయాడు.

హైదరాబాద్: మహారాష్ట్ర బిజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయాడు. బిజాపూర్ ఎస్పీ కె.ఎల్.ధ్రువ్ తెలిపిన వివరాలివీ..నక్సల్స్ కదలికల సమాచారం అందటంతో శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు దుబాయిగూడ అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య దాదాపు గంటపాటు కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు పారిపోగా ఆ ప్రాంతంలో పడి ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఏరియా కమాండర్‌గా భావిస్తున్నారు. అతడి వద్ద ఉన్న .303 రివాల్వర్‌తో పాటు సంకేత భాషలో ఉన్న పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement