రూ. 200 ప్రయోగానికి నోబెల్ ప్రైజ్
ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది ప్రపంచానికి అద్భుతాలు అందించింది. అటువంటి వారిలో భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత దేశ ఖ్యాతిని నలుదిశలు చాటి చెప్పిన ఘనుడు సర్ సివి రామన్. భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగి నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసిగా కీర్తిగడించారు. సైన్స్ డే సందర్భంగా సివి రామన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.