
సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ
ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు.
ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. ఆయన చీపురుకట్టలు పట్టుకుని వారణాసిలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాల్గొని వారణాసి వీధులను శుభ్రంచేశారు. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీ ఆయనే. ఇంతకుముందు ప్రియాంకా చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిది మందిని నామినేట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతోంది.
కాగా, కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రధాని మోదీ ఆయనను తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. వారణాసిలో చీపురు పట్టినందుకు అభినందనలని, ఇది చాలా మంచి ప్రయత్నమని తెలిపారు.
Bravo @kailashkher! I congratulate you for joining Swachh Bharat Mission in Varanasi. Admirable effort. https://t.co/SbqweeAO2t
— Narendra Modi (@narendramodi) December 23, 2014