సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ | narendra modi praises singer kailash kher | Sakshi
Sakshi News home page

సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ

Dec 23 2014 8:17 AM | Updated on Aug 15 2018 2:20 PM

సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ - Sakshi

సూఫీ గాయకుడికి మోదీ అభినందనల వెల్లువ

ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు.

ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. ఆయన చీపురుకట్టలు పట్టుకుని వారణాసిలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాల్గొని వారణాసి వీధులను శుభ్రంచేశారు. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీ ఆయనే. ఇంతకుముందు ప్రియాంకా చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిది మందిని నామినేట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతోంది.

కాగా, కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రధాని మోదీ ఆయనను తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. వారణాసిలో చీపురు పట్టినందుకు అభినందనలని, ఇది చాలా మంచి ప్రయత్నమని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement