భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుకు ప్రధాని నివాళి | Modi pays tribute to Bhagat Singh, Sukhdev, Rajguru | Sakshi
Sakshi News home page

భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుకు ప్రధాని నివాళి

Mar 23 2015 11:12 AM | Updated on Aug 15 2018 2:20 PM

భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుకు ప్రధాని నివాళి - Sakshi

భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుకు ప్రధాని నివాళి

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య పోరాట యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు.

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య పోరాట యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. సోమవారం వారి వర్థంతి సందర్భంగా ప్రధాని తొలిసారి పంజాబ్లోని హుస్సేనీవాలకు వచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లకు ప్రతి ఒక్కరు చెయ్యెత్తి నమస్కరించాలంటూ నివాళులర్పించిన అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలతో సహా సర్వస్వాన్ని అర్పించిన గొప్పవారని కొనియాడారు. వారు గొప్ప ఆత్మీయాభిమానం గలవారని చెప్పారు. 1907లో జన్మించిన భగత్ సింగ్ బ్రతికున్నంత కాలం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 1931 మార్చి 23న ఉరితీయబడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement