హిమాచల్ప్రదేశ్లో గురువారం స్వల్ప భూకంపం సంభవించింది.
హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం
Mar 2 2017 10:47 AM | Updated on Sep 5 2017 5:01 AM
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో గురువారం స్వల్ప భూకంపం సంభవించింది. జమ్ము కాశ్మీర్ సరిహద్ధులోని చంబా ప్రాంతంలో తెల్లవారుజామున 01.39 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన సమాచారం తమకు అందలేదని భూకంప కేంద్ర డైరెక్టర్ మన్మోహన్సింగ్ తెలిపారు. చంబా ప్రాంతంలో భూకంపం సంభవించడం ఈ నెలలో ఇది రెండో సారి.
Advertisement


