వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో యువ పైలట్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం..
శ్రీనగర్: వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో యువ పైలట్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం... అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా సమీపంలోని మిర్హామా వద్ద పొలాల్లో కూలిపోయినట్లు వాయుసేన వెల్లడించింది. ఈ ప్రమాదంలో పైలట్ స్క్వాడ్రన్ లీడర్ రఘువంశి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, పైలట్ మృతి పట్ల నూతన రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు.