కూలిన మిగ్-21.. పైలట్ మృతి | MIG-21 fighter aircraft crashes in Kashmir, pilot dead | Sakshi
Sakshi News home page

కూలిన మిగ్-21.. పైలట్ మృతి

May 28 2014 3:08 AM | Updated on Sep 2 2017 7:56 AM

వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో యువ పైలట్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం..

శ్రీనగర్: వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో యువ పైలట్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం... అనంతనాగ్ జిల్లా బిజ్‌బెహరా సమీపంలోని మిర్హామా వద్ద పొలాల్లో కూలిపోయినట్లు వాయుసేన వెల్లడించింది. ఈ ప్రమాదంలో పైలట్ స్క్వాడ్రన్ లీడర్ రఘువంశి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, పైలట్ మృతి పట్ల నూతన రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement