breaking news
MiG-21 war plane
-
థాంక్యూ మిగ్
భారత వైమానిక దళం నుంచి మిగ్–21 యుద్ధ విమానాలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పిన సందర్భంగా ఆ ఫైటర్జెట్తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.నడపడం నల్లేరు మీద నడక కాదు తొలిసారి మన దగ్గరకు వచ్చిన విమానం మిగ్–21, టైప్–74. దానికి అప్పట్లో శిక్షణ విమానాలు లేవు. తొలిసారి ఒంటరిగా విమానాన్ని నడిపే ప్రక్రియ మిగ్–21తోనే మొదలైంది. ఈ విమానానికి సిమ్యులేటర్ లేకపోవడమే కాకుండా, మొత్తం కాక్పిట్లో ఏదీ ఆంగ్లంలో రాసి లేదు, అంతా రష్యన్ భాషలో ఉండేదని చెప్పారు. ఈ పాత ఎయిర్ వారియర్, వేగం కొలత యూనిట్ కూడా హఠాత్తుగా ‘నాట్స్‘ నుండి ‘కిమీ/గంట‘కి మారిపోయేది. పైలట్లు ‘నాట్స్‘కు అలవాటు పడటంతో.. విమానం నడపడం ఒక సవాలుగా మారేది. ఈ విమానాన్ని తొలిసారి నడిపినపుడు ఎక్కువగా దారి తప్పిపోతారు, తిరిగి వచ్చే వరకు, దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియదు. – ఏవై టిప్నిస్, ఎయిర్ చీఫ్ మార్షల్, మాజీ భారతీయ వాయుసేనాధిపతిశవపేటికతో పోలిక సరికాదు ప్రమాదాలతో ముడిపడిన ఏ విమానాన్ని అయినా ’ఎగిరే శవపేటిక’ వంటి పదాలతో వరి్ణంచడం సరికాదు. అలాంటి పదాలు వాడటం వల్ల, ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న పైలట్ల కుటుంబ సభ్యుల మనోధైర్యం దెబ్బతింటుంది, – పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ పైలట్ నమ్మకమైన సహచరుడు ఆరు దశాబ్దాలుగా మిగ్–21 భారతీయ వాయుసేనకు వెన్నెముకగా‘ ఉంది. యుద్ధంలో, శాంతి సమయంలో ఒక చిహ్నంగా, నమ్మకమైన సహచరుడిగా, తరతరాల ఫైటర్ పైలట్లకు ఒక పరీక్ష కేంద్రంగా వ్యవహరించింది. – నితిన్ సాతే, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ అన్ని సైనిక చర్యల్లోనూ మేటి 1965, 1971 యుద్ధాల్లో అత్యంత అధునాతన ఫైటర్గా ఉన్న ఈ విమానం, భారతదేశం చేపట్టిన అన్ని సైనిక చర్యలలో ముందుంది. ఆపరేషన్ సిందూర్లో కూడా సత్తా చాటింది, ఇది పాత తరం ఫైటర్ అయినప్పటికీ, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫాం విధులు నిర్వహించింది. – నంద రాజేందర్, స్క్వాడ్రన్ నంబర్ 23 కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెపె్టన్ -
వీర విహంగానికి వందనం
చండీగఢ్: మేఘావృతం కాని గగనం నీలిరంగులో మెరిసిపోయింది. ఆరు దశాబ్దాలకు పైగా భారతావనికి కొండంత అండగా నిలిచిన వీర విహంగానికి వీడ్కోలు పలికే వేళ.. ఆకాశం వెలిగిపోయింది. యుద్ధ విమానం మిగ్–21 సేవల ఉపసంహరణ ఉద్విగ్నభరిత క్షణాల్లో భారత గగన వీధిలో వాతావరణమిది. చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో మిగ్–21 డీకమిషనింగ్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. భారత వైమానిక దళం యుద్ధ విమానాల బృందానికి వెన్నెముకగా ఉన్న ఈ ఐకానిక్ మిఖోయాన్–గురేవిచ్ మిగ్–21 ఫైటర్ జెట్లు శుక్రవారం చివరిసారిగా భారత గగనతలంలో ఎగిరాయి. దీంతో 62 ఏళ్ల మిగ్–21ల సుదీర్ఘ ప్రస్థానానికి తెర పడింది. కనురెప్పవేయనివ్వని విన్యాసాలు ఒక చారిత్రక అధ్యాయం ముగింపును సూచిస్తూ, లాంఛనప్రాయ ఫ్లైపాస్ట్, డీకమిషనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ వాయుసేనకు చెందిన ప్రఖ్యాత స్కైడైవింగ్ బృందం ’ఆకాశ్ గంగ’.. 8,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి ఆకట్టుకుంది. తరువాత మిగ్–21 విమానం అద్భుతమైన ఫ్లైపాస్ట్, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం కచి్చతత్వంతో కూడిన కవాతు, వైమానిక వందనం కొనసాగాయి. ఫైటర్ పైలట్లు మూడు విమానాల ’బాదల్’ ఫార్మేషన్, నాలుగు విమానాల ’పాంథర్’ ఫార్మేషన్లో చివరిసారిగా గగనతలంపైకి దూసుకుపోయాయి. ’సూర్య కిరణ్’ ఏరోబాటిక్ బృందం కూడా ఉత్కంఠభరితమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నంబర్ 23 స్క్వాడ్రన్కు చెందిన మిగ్–21 జెట్లు ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వాటికి ’వాటర్ కానన్ సెల్యూట్’ (నీటి ఫిరంగి వందనం) ఇచ్చారు. ’జాగ్వార్’, ’తేజస్’ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వీడ్కోలు కార్యక్రమానికి నెల ముందు, రాజస్థాన్లోని బికనేర్లోని నల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మిగ్–21 చివరిసారిగా ఎగిరాయి. ఈ వీడ్కోలుకు గుర్తుగా, ఆగస్టు 18–19న భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నల్ ఎయిర్ బేస్ నుంచి మిగ్–21 సోలో సోర్టీస్ నిర్వహించారు. 1981లో భారతీయ వాయుసేన చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన దిల్బాగ్ సింగ్, 1963లో ఇక్కడ మొదటి మిగ్–21 స్క్వాడ్రన్కు నాయకత్వం వహించడం విశేషం.దశాబ్దాలపాటు భారతీయ భద్రతను మోసింది మిగ్–21 కేవలం ఒక విమానం లేదా యంత్రం మాత్రమే కాదని.. అది దేశ గౌరవం, భారత్, రష్యాల మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మిగ్–21 సేవల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అరవయ్యేళ్లకు పైగా మిగ్–21 సాగించిన ప్రయాణం అసమానమైనదని అభివరి్ణంచారు. ఈ శక్తివంతమైన విమానం దశాబ్దాలుగా దేశ భద్రత భారాన్ని తన రెక్కలపై మోసిందని కొనియాడారు. మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. యుద్ధ వ్యూహాలను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. భారత సైనిక విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నామని వ్యాఖ్యానించారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2019 బాలాకోట్ వైమానిక దాడుల నుంచి ఇటీవలి ఆపరేషన్ సిందూర్ వరకు, మిగ్–21 మన సాయుధ దళాలకు అపారమైన శక్తిని అందించిందని వివరించారు. భారతీయ సైనిక విమానయాన ప్రయాణంలో అనేక గరి్వంచదగిన క్షణాలను ఈ విమానం జోడించిందని తెలిపారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ప్రతికూల పరిస్థితుల్లో మిగ్–21 విమానం ఢాకా గవర్నర్ హౌస్పై దాడి చేసిన రోజే.. ఆ యుద్ధం ఫలితం స్పష్టమైపోయిందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. అదెలాంటి చారిత్రక మిషన్ అయినా.. మిగ్–21 భారతీయ జాతీయ పతాక గౌరవాన్ని ఉన్నతంగా నిలబెట్టిందన్నారు.ఎప్పుడో సేవల ఉపసంహరణ ‘మిగ్–21 గురించి మాట్లాడేటప్పుడు, భారతీయ వాయుసేన 60 ఏళ్ల నాటి విమానాలను నడుపుతోందన్న వ్యాఖ్య లు వింటుంటాం. కానీ 1960, 1970ల లో సాయుధ దళాల్లోకి వచ్చిన మిగ్–21 యుద్ధ విమానాలను చాలా కాలం క్రితమే సేవల నుంచి తొలగించారన్న ముఖ్యమైన వాస్తవాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’.. అని రాజ్నాథ్సింగ్ ప్రకటించారు. వీడ్కోలు కార్యక్రమంలో భారతీయ వాయుసేన మాజీ చీఫ్లు ఏవై టిప్నిస్, ఎస్పీ త్యాగి, బీఎస్ ధనోవా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా సహా మిగ్ విమానాన్ని నడిపిన ఎందరో పైలట్లు పాల్గొన్నారు. -
హిమాచల్లో కుప్పకూలిన యుద్ధవిమానం
సిమ్లా : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం కూలిపోయింది. పంజాబ్లోని పటాన్కోట్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్ డివిజన్ పట్టా జతియన్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదం నేపథ్యంలో పైలట్ గల్లంతయ్యారని ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. కాగా భారత వాయుసేన యుద్ధవిమానం కూలిన ఘటన ఇటీవల ఇది మూడవది కావడం గమనార్హం. గత నెలలో గుజరాత్, మహారాష్ట్రలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్ 5న జామ్నగర్ ఎయిర్ బేస్లో బయలుదేరిన జాగ్వర్ యుద్ధ విమానం కచ్ జిల్లాలో కూలిపోవడంతో సీనియర్ అధికారి మరణించారు. ఇక జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ ద్రాక్ష తోటలో సుఖోయ్-30 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. -
కూలిన మిగ్-21.. పైలట్ మృతి
శ్రీనగర్: వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో యువ పైలట్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం... అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా సమీపంలోని మిర్హామా వద్ద పొలాల్లో కూలిపోయినట్లు వాయుసేన వెల్లడించింది. ఈ ప్రమాదంలో పైలట్ స్క్వాడ్రన్ లీడర్ రఘువంశి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, పైలట్ మృతి పట్ల నూతన రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు.